News Hunter : యాదాద్రి భువనగిరి జిల్లాలోని బహుపేట గ్రామ సమీపంలో ఆర్మీ ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం లో పైలట్కు తీవ్ర గాయాలు కాగా , మరో వ్యక్తి యోగేష్ యాదవ్ మాత్రం ప్యారాచ్యూట్ సహయంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.ఇక ఈ ప్రమాదంలో విమానం కాలి బూడిదైపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు , డాక్టర్స్ ఆర్మీ హెలికాప్టర్ లో ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారణ చేపడుతున్నారు.

0 Comments