తమిళనాడులో వాతావరణ శాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. తమిళనాడుపై గజ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. 13 జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చెన్నై, కాంచీపురంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

0 Comments