News Hunter : పులివెందుల డిఎస్పి డి.నాగరాజు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ... రాయచోటి రూరల్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసు బృందం నిర్వహించిన దాడులలో ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 14 ఎర్ర చందనం దుంగలను, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
