ADS

header ads

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ విజయం

భారత్ - పాక్ మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు. అది మహిళా పోరైనా సరే. టీ20 మహిళా వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం పాక్-భారత్ ల మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులకి కడుపునింపేసింది. ఈ పోరులో టీమిండియా మహిళా జట్టు పాక్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. పాక్‌ బ్యాట్స్‌మెన్ లలో బిస్మా మరూఫ్‌ 53, ,నిదాదార్‌ 52 పరుగులతో రాణించారు.
అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత మహిళా జట్టు.. ఓపెనర్‌ మంధాన 26, జెమీమా రోడ్రిగ్స్‌ 16, మిథాలి రాజ్‌ 56 పరుగులతో రాణించడంతో 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిచేధించింది.
స్కోర్ బోర్డ్ :
పాకిస్తాన్‌ : అయేసా జఫర్‌ (సి) వేదా కృష్ణమూర్తి (బి) 0, జవేరియా ఖాన్‌ రనౌట్‌(రాధా యాదవ్‌/పూనం) 17, ఒమామియా సొహైల్‌ రనౌట్‌ (రోడ్రిగ్స్‌) 3, బిస్మా మరూఫ్‌ (సి) వేదా కృష్ణమూర్తి (బి)హేమలత 53, నిదాదార్‌ (సి) హర్మన్‌ ప్రీత్‌ (బి)హేమలత 52, అలియా రియాజ్‌ స్టంప్డ్‌ తాన్యా బాటియా (బి) పూనం 4, నహిదా ఖాన్‌ నాటౌట్‌ 0, సనామీర్‌ స్టంప్డ్‌ తాన్యా బాటియా (బి) పూనం 0, సిడ్రా నవాజ్‌ నాటౌట్‌ 0 ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 133/7 (20ఓవర్లు)
భారత్‌ : మిథాలి రాజ్‌ (సి) నిదాదార్‌ (బి) డి బేగ్‌ 56, స్మృతి మంధాన (సి) ఒమైమా సొహైల్‌ (బి) మరూఫ్‌ 26, జెమీమా రోడ్రిగ్స్‌ సి అండ్‌ బి నిదాదార్‌ 16, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాటౌట్‌ 14, వేదా కృష్ణమూర్తి నాటౌట్‌ 8, ఎక్స్‌ట్రాలు 17 మొత్తం 137/3(19ఓవర్లు)

Post a Comment

0 Comments