News Hunter : తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఈ రోజు పి.గన్నవరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాజకీయ లబ్ది కోసం కొందరు నాయకులు కులాలు, ప్రాంతాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని. కులాలు, ప్రాంతాలకు అతీతంగా పాలన రావాలని ఆయన ఆకాంక్షించారు.పాతికేళ్ల భవిష్యత్తు కోసమే జనసేనను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను ఏమీ ఆశించకుండా తెదేపాకు మద్దతు తెలిపానన్నారు. చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సే ధ్యేయంగా తాను పెరిగానని, సమాజంలో అవినీతిని చూసి తనకు విసుగొచ్చిందని తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు వెల్లడించారు. వైకాపా అధినేత జగన్కు రాజ్యాంగం అంటే గౌరవంలేదని ధ్వజమెత్తారు. కోనసీమ గ్యాస్ నిక్షేపాలను గుజరాత్కు తరలిస్తున్నారని ఆరోపించారు. కోనసీమకు జరుగుతున్నఅన్యాయంపై నిలదీసేందుకు తానెవ్వరికీ భయపడనన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెదేపా పోయి, జగన్ను పక్కన పెడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మరో ఐదేళ్లు తెదేపా, జగన్ ఉంటే మాత్రం గోదావరిలో ఇసుక ఉండదని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలూ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాయని పవన్ విమర్శించారు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెదేపా పోయి, జగన్ను పక్కన పెడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మరో ఐదేళ్లు తెదేపా, జగన్ ఉంటే మాత్రం గోదావరిలో ఇసుక ఉండదని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలూ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాయని పవన్ విమర్శించారు.

0 Comments