హైదరాబాద్: ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రావాలని చాలా మంది అడుగుతున్నారని, వంద శాతం ఆంధప్రదేశ్కు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

0 Comments