ADS

header ads

సింధును అభినందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

News Hunter : భారత బాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ప్రతిష్టాత్మక బిడబ్లూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ను మొదటిసారి నెగ్గిన సింధుకు వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఉదయం సింధుతో పాటు ఆమె కుటుంబసభ్యులు వెంకయ్యనాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..సింధు దేశానికి మంచి పేరు తీసుకువచ్చారని , ఈ విజయంతో ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు. గతేడాది సింధు ఫైనల్‌కు చేరినా సిల్వర్‌ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాని ఈ సారి మాత్రం సింధు టైటిల్‌ గెలవడం విశేషం. ఈ ఏడాది మొదటి నుంచీ సింధు టాప్‌ ఫామ్‌లో ఉంది.