ADS

header ads

సిబియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు పై అవగాహనా సదస్సు..

NEWSHUNTER :నెల్లూరు ముత్తుకూరు  రోడ్డులోని రాధె గెస్ట్ ఇన్ లో సిబియన్ ఆర్మీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది,  సభ్యులకు ఓటర్ నమోదు పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిబియన్ ఆర్మీ  స్టేట్ జెనరల్ సెక్రెటరీ  నంద కిషోర్ అధ్యక్షత వహించి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు,సిబియన్ ఆర్మీ సభ్యుల సంఖ్యను ఎలా పెంచాలి, ఎలక్షన్ లోపు ఎలా ముందుకు వెళ్లాలి అని చర్చించారు.

 సిబియన్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు చైతన్య లింగ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్లో మన వోట్ ఉందొ లేదో ఎలా తెలుసుకోవాలో తెలియజేసారు, ఒకవేళ ఓటు లేనిచో  ఆన్లైన్లో ఓటు ఎలా నమోదు చేసుకోవాలో వారికీ వివరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన సభ్యులు ఓటర్ నమోదు పై తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యాదర్శి వినోద్ కుమార్,గడ్డం మహేంద్ర బాబు, కార్యకర్తలు కళ్యాణి,హజరత్ తదితరులు పాల్గొన్నారు.