News Hunter : టీఆర్ఎస్ నేత కేసీఆర్ మాయగాడని, ఆయన మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ నేత విజయశాంతి హెచ్చరించారు. ఏటూరునాగారంలో ములుగు మహాకూటమి అభ్యర్థితో సీతక్కతో కలిసి విజయశాంతి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ములుగును జిల్లా చేస్తానని కేసీఆర్ మోసం చేశారని, కమలాపురం బిల్డ్ కర్మాగారం గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడరని విజయశాంతి ప్రశ్నించారు.

0 Comments