ADS

header ads

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

News Hunter : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65,028 మంది భక్తులు దర్శించుకోగా, 30,496 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లు.