తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన సుప్రభాత సేవలో రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డా " తానేటి వనిత పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి వనిత తెలిపారు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన వైస్సార్సీపీ ముఖ్య నాయకులకు హోంమంత్రి దగ్గరుండి విఐపి బ్రేక్ దర్శనం చేయించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి పైన ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్తించినట్లు హోం మినిస్టర్ పేర్కొన్నారు. అనంతరం జాపాలి లోని శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించారు

0 Comments